ప్రముఖ బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషి దక్షిణాదిన సూపర్స్టార్ రజనీకాంత్తో నటించిన చిత్రం “కాలా”. ఇప్పుడు ఈ బ్యూటీ హాలీవుడ్లోనటించడానికి సిద్ధమవుతున్నారు. హాలీవుడ్ దర్శకుడు జాక్ స్నిడర్ దర్శకత్వంలో “ఆర్మీ ఆఫ్ ది డెత్” అనే జాంబిక్ థ్రిల్లర్ రూపొందనుంది. జూలై నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో హ్యుమాఖురేషి కీలక పాత్రలో నటిస్తున్నారు. జాక్ “300, మ్యాన్ ఆఫ్ స్టీల్, బ్యాట్ మాన్ వెర్సస్ సూపర్మేన్” వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతంహ్యూమా “లైలా” అనే టీవీ సీరియల్లో నటిస్తున్నారు. ఇప్పటికే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో అవకాశాలు సంపాదిస్తూ దూసుకెళ్తోంది. మరి హ్యుమా ఖురేషి కూడా హాలీవుడ్లో సెటిల్ అవుతుందేమో చూడాలి.
previous post