కరోనా నేపథ్యంలో ఈ ఏడాది హజ్ యాత్ర వాయిదా వేసుకోవాలని సౌదీ అరేబియా ప్రభుత్వం సూచించింది. కోవిడ్-19 విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది హజ్ యాత్రకు రాకపోవటమే మంచిదని సౌదీ హజ్ అండ్ ఉమ్రా మంత్రి ముహమ్మత్ సలా బిన్ తాహెర్ బెంటెన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
యాత్రపై తాము మళ్లీ ప్రకటన చేసేవరకు ప్రపంచంలోని ముస్లింలు ఎవరూ యాత్రకు సంబంధించి ట్రావెల్ సంస్థలతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దని కోరారు. సౌదీలోని పవిత్రమైన మక్క, మదీనా నగరాలలోకి విదేశీయులు రాకుండా ఆ దేశం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నిషేధించింది. కరోనా కారణంగా సౌదీలో ఇప్పటివరకు పది మంది మరణించారు.
కాళేశ్వరం నిర్మాణాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు: జగ్గారెడ్డి