ఎస్పీ రాజశేఖర్ బాబు గుంటూరు జిల్లా వ్యాప్తంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 84 మంది ఎస్సైలను బదిలీ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన ఎస్సైలందరూ ఒకే పోలీస్ స్టేషన్లో సంవత్సరాల తరబడి పనిచేస్తున్నారు కావడం గమనార్హం.
వీరందరి పైనా అవినీతి ఆరోపణలు ఉండటంతో, గత కొంతకాలంగా వీరి బదిలీకి కసరత్తు జరుగుతోంది. పాలనలో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఓట్ల లెక్కింపునకు కొద్ది రోజుల ముందు ఇంత పెద్ద ఎత్తున ఎస్సైల బదిలీలు జరగడం చర్చనీయాంశమైంది.