telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

వెస్టిండీస్ సిరీస్ : .. రోహిత్ అర్ధశతకం.. భారీ లక్ష్యం..

huge score by india on westindies in 2nd t20

రెండో టీ20 లో భాగంగా ఓపెనర్ రోహిత్ శర్మ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ వెస్టిండీస్ పై ఫిఫ్టీ సాధించగా, టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసింది. విండీస్ తో రెండో టి20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా రోహిత్ శర్మ 51 బంతుల్లో 67 పరుగులతో అదరగొట్టాడు. ఈ డాషింగ్ ఓపెనర్ 6 ఫోర్లు, 3 సిక్స్ లు బాది ప్రేక్షకులను అలరించాడు.

మరో ఓపెనర్ ధావన్ 23, కెప్టెన్ విరాట్ కోహ్లీ 28 పరుగులు చేశారు. పంత్ మరోసారి నిరాశపరుస్తూ 4 పరుగులకే వెనుదిరిగాడు. చివర్లో కృనాల్ పాండ్య 13 బంతుల్లో 2 సిక్స్ లతో 20 పరుగులు సాధించాడు. వెస్టిండీస్ బౌలర్లలో ఒషేన్ థామస్, షెల్డన్ కాట్రెల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కీమో పాల్ కు ఓ వికెట్ దక్కింది.

Related posts