రైల్వేశాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి అయిదు నెలల్లో తన లక్ష్యాలను చేరుకోవడంలో వెనకబడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏప్రిల్-ఆగస్టు నెలల మధ్య ఆదాయం దాదాపు రూ.12,000 కోట్లు తగ్గింది. జీతాలు, పింఛన్లను కలిపితే ఈ లోటు మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
నిజానికి రైల్వే ఆదాయం 3.3% పెరిగినా, ఖర్చులు 8.65 శాతం ఎక్కువయ్యాయి. ఈ లెక్కన ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఆదాయ లోటు రూ.30,000 కోట్లు అవుతుందని భావిస్తున్నారు. సరకు రవాణాను 12.22% పెంచాలనుకున్నా 2.8 శాతమే పెరిగింది.