అరకు నుండి విజయనగరం పట్టణంలో 211 కేజీల గంజాయిని ఆటో మీద తీసుకొచ్చి పాత బంగ్లాలో లోడ్ చేస్తుండగా అది చూసిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు విజయనగరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీ హరి రాజు, ఎస్.ఐ. సన్యాసిరావు తమ సిబ్బందితో కలిసి చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం రాత్రి విజయనగరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సంఘటన వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా అరకు మండలం ముంచుగిపుట్టు ప్రాంతనికి చెందిన బి.ప్రకాష్ రావు(26), తన ఆటో లో 3 కేజీలు చొప్పున గంజాయిని 60 ప్యాకెట్లు గా చేసి అక్కడ నుండి విజయనగరం పట్టణంలో కొత్తపేట పాకీ విధిలోకి తీసుకొచ్చి అక్కడ నివాసం ఉంటున్న మహ్మద్ అలిమ్( 45)ని కలిసి ఆయన చూపించిన పాడుబడిపోయిన బంగ్లాలో లోడ్ చేస్తుండగా పోలీసులు ఆకస్మిక దాడులు చేసి పట్టుకున్నట్లు తెలిపారు.
దీని విలువ 6 లక్షలు 33 వేలు ఉంటుందన్నారు. వీటిని ఎం.ఆర్.ఓ. , వి.ఆర్.ఓ సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరు గత కొంత కాలంగా ఇలాగే లోడ్ చేసి ఇతర జిల్లాలకు రహాస్యంగా తీసుకువెళ్లి అమ్ముతున్నట్లు తమ విచారణలో తేలిందని తెలిపారు. వీరి మీద గతంలో ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయా ? అనేది విచారిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి జిల్లా మేజిస్ట్రేట్ ముందు ఇద్దరిని ప్రవేశపెట్టగా ఇద్దరికి రిమాండ్ విధించినట్లు తెలిపారు.