మరోసారి భద్రాచలం పట్టణంలో భారీగా గంజాయి పట్టుబడింది.. పోలీసులు వివరాల ప్రకారం.. భద్రాచలంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ అటుగా వస్తున్న ఓ కారును అడ్డుకునేందుకు యత్నించారు. అయినా కారు ఆగకపోవడంతో పోలీసులు వెంబడించారు. రామాలయంలో ప్రాంతంలో కారు ఆగి ఉండటం గమనించి పోలీసులు కారు లోపల తనిఖీ చేశారు.
ఆ కారులో భారీగా గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. పట్టుబడిన గంజాయి 2.80 క్వింటాలు ఉంటుందని, దీని విలువ సుమారు రూ.43 లక్షలు ఉంటుందని సీఐ వినోద్రెడ్డి తెలిపారు. గంజాయి తరలిస్తున్న వారు పరారైనట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు చెప్పారు.