నేడు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సర్తానా ప్రాంతంలో ఉన్న ఓ బిల్డింగ్ లోని రెండో అంతస్తులో మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాద ఘటనలో పలువురు మృతి చెందగా, చాలా మందికి గాయాలయ్యాయి. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పలువురు బాధితులు ఆ బిల్డింగ్ పై నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాల పాలయ్యారు.
18 అగ్నిమాపక శకటాలు ఈ మంటలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగాయి. ఈ ఘటనపై సూరత్ పోలీస్ కమిషనర్ స్పందిస్తూ, ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. కాగా, సహాయకచర్యలు ముమ్మరం చేయాలని ఈ మేరకు ప్రధాని మోదీ ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
దర్శకుడితో గోడపై స్పందించిన నాగశౌర్య… ఇంకెప్పుడూ అతనితో మాట్లాడడట…!?