telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

గుజరాత్ లో .. ఘోర అగ్నిప్రమాదం.. 15మంది మృతి.. 18అగ్నిమాపకదళాలు…

fire accident make ash of acres wheat crop

నేడు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సర్తానా ప్రాంతంలో ఉన్న ఓ బిల్డింగ్ లోని రెండో అంతస్తులో మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాద ఘటనలో పలువురు మృతి చెందగా, చాలా మందికి గాయాలయ్యాయి. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పలువురు బాధితులు ఆ బిల్డింగ్ పై నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాల పాలయ్యారు.

18 అగ్నిమాపక శకటాలు ఈ మంటలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగాయి. ఈ ఘటనపై సూరత్ పోలీస్ కమిషనర్ స్పందిస్తూ, ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. కాగా, సహాయకచర్యలు ముమ్మరం చేయాలని ఈ మేరకు ప్రధాని మోదీ ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

Related posts