నేడు ఐపీఎల్ మ్యాచ్ ఉండగానే, ఉప్పల్ స్టేడియంలో పెనుప్రమాదం తప్పింది. గతరాత్రి కురిసిన భారీ వర్షానికే ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు, బ్యానర్లు, షెడ్స్ కుప్పకూలాయి. ఉప్పల్ స్టేడియంలో సౌత్ పెవీలియన్ బైలాక్లో పెనుగాలులకు షెడ్డు, ఓ ఎల్ఈడీ కుప్పకూలాయి. ఈదురు గాలులు తాకిడికి ఎనభై శాతం సౌత్ పెవీలియన్ దెబ్బతిన్నది. ఐపీఎల్ మ్యాచ్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగినప్పుడు జనాలు ఎవరూ లేకపోవడంతో సిబ్బంది ఊపిరిపీల్చుకుంది.
ఎన్టీఆర్ స్టేడియంలో ఎగ్జిబిషన్ షెడ్స్, ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరి మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే.. చాంద్రాయణగుట్ట షెడ్డు కూలి బాలుడి మృతి చెందాడు. నగరంలో పలుచోట్ల వృక్షాలు నేలకూలగా.. స్తంభాలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలు ప్రాంతాల్లో కార్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ అంతరాయంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.