హువావే మరో సరికొత్త మొబైల్లోను మంగళవారం భారత్లో విడుదల చేసింది. వెనుకవైపు నాలుగు కెమెరాలు కలిగి ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. గత నెలలో పారిస్లో జరిగిన కార్యక్రమంలో ఈ ఫోన్ను వెల్లడించిన హువావే ఇప్పుడు అతిపెద్ద మొబైల్ మార్కెట్ కలిగిన భారత్లోనూ విడుదల చేసింది. దీని ధరను రూ.71,900గా నిర్ణయించారు. అదనంగా మరో రూ.2000 చెల్లిస్తే రూ.15,990 విలువైన హువావే వాచ్ జీటీ పొందవచ్చు. దీనితో పాటు హువావే పీ30లైట్ను కూడా కంపెనీ తీసుకొచ్చింది. ఇది 4జీబీ, 6జీబీ ర్యామ్ వేరియంట్లలో లభించనుంది. ఈఫోన్ ధరలు వరుసగా రూ.19,900, 22,900. ఇక ప్రారంభ ఆఫర్ కింద రిలయన్స్ జియో రూ.2,200 క్యాష్ బ్యాక్ను అందిస్తోంది.
హువావే పీ30 ప్రో ప్రత్యేకతలు :
* 6.47 అంగుళాల ఫుల్హెచ్+ డిస్ప్లే
* 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* కిరిన్ 980 ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ పై(ఇఎంయూఐ)
* వెనుకవైపు 40+20+8మెగాపిక్సెల్ కెమెరాలతో పాటు, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కెమెరా
* ముందువైపు 32మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
* 4,200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
* 15W వైర్లెస్ ఛార్జింగ్, 40W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్
హువావే పీ30 లైట్ ప్రత్యేకతలు :
* 6.15 అంగుళాల ఫుల్హెచ్ డిస్ప్లే
* 4జీబీ/6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* కిరిన్ 710 ప్రాసెసర్
* వెనుకవైపు 24+8+2 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా
* ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
* 3,340ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ ఛార్జింగ్