telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

హోటల్ బిల్లు చెల్లించలేదని..కస్టమర్ ను కొట్టి చంపిన యజమాని!

New couples attack SR Nagar

హోటల్ బిల్లు చెల్లించలేదని యజమాని కస్టమర్ ను కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బదోమీ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సూరజ్, విశాల్ అనే ఇద్దరు యువకులు ఓ దాబా హోటల్ కు వచ్చారు. భోజనం తిన్నాక యజమాని రూ.180 బిల్ వేశాడు. అయితే తాము తిన్నదానికి ఇది చాలా ఎక్కువని ఇద్దరు యువకులు వాదనకు దిగారు.

ఈ వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారడంతో సహనం కోల్పోయిన యజమాని గుర్మయిల్, అతని కుమారులు సరేంద్ర తమ సిబ్బందితో కలిసి యువకులపై దాడికి దిగారు. రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడి నుంచి విశాల్ తప్పించుకోగా, సూరజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గుర్మయిల్ తో పాటు ఇతర నిందితులపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.

Related posts