telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం:హోం మంత్రి సుచరిత

ap minister sucharita on fluds

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఏపీ హోం మంత్రి సుచరిత అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజధాని రైతులు ఆందోళన విరమించాలని కోరుతున్నామని తెలిపారు. రేపు సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరగనుందని చెప్పారు. రైతుల ఆందోళనల దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఏపీ దిశ చట్టం అమలు కోసం రూ.23 కోట్ల నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ను నియమిస్తున్నామని అన్నారు. మూడు ఫోరెన్సిక్ ల్యాబ్స్ లో పని చేసే 176 సిబ్బంది నియామకానికి చర్యలు చేపడతామన్నారు. మహిళా పోలీస్ స్టేషన్లను మరింత బలోపేతం చేస్తామని అన్నారు. దిశ చట్టం పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఐపీఎస్ అధికారిని నియమిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Related posts