దళితులను కించపరుస్తూ మాట్లాడితే చర్యలు తప్పవని ఏపీ హోంమంత్రి సుచరిత హెచ్చరించారు. టీడీపీ నేతలు దళిత మహిళా ఎస్సైను కులం పేరుతో దూషించడం తప్పని అన్నారు. సదరు మహిళా ఎస్సై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో టీడీపీ ఉద్రిక్తతలను రేపుతోందని మండిపడ్డారు.
పల్నాడు ప్రాంతంలో ఏదో జరగుతోందంటూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారనిఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో టీడీపీ అలజడి సృష్టిస్తోందని అన్నారు. ఇలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. వైసీపీ కార్యకర్తలపై కూడా కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. త్వరలోనే పోలీసు శాఖలో ఉన్న ఖాళీగా పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.