telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గోదావరిలో లాంచీ మునక పై హోం మంత్రి ఆరా

ap minister sucharita on fluds

గోదావరిలో లాంచీ మునక ఘటనపై ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత ఆరా తీశారు. ఈ ప్రమాద ఘటన సమాచారం తెలిసిన వెంటనే సహాయక చర్యలకు ఆదేశించామని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటన స్థలానికి వెళ్లాయని తెలిపారు. సహాయక చర్యల కోసం నేవీ సాయం కోరామని, ఓఎన్జీసీ నుంచి చాపర్లు పంపమని అడిగామని చెప్పారు.

గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉందని బోటులో 61 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోందని అన్నారు. వారి వద్ద లైఫ్ జాకెట్లు ఉన్నట్టు చెబుతున్నారని అన్నారు. లాంచీ కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నట్టు తేలితే చర్యలు చేపడతామని అన్నారు. లాంచీకి ఎవరు అనుమతించారన్న పూర్తి వివరాలు తీసుకుంటామని అన్నారు. అందుకు బాధ్యులైన అధికారుల పై వారిపై చర్యలు తప్పవని అన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగుకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Related posts