telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

లఖ్‌నవూలో రాజ్‌నాథ్‌ నామినేషన్‌

Rajnath Singh inaugurates NIA office

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ రోజు నామినేషన్‌ దాఖలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. నామినేషన్‌కు ముందు నగరంలో ఆయన రోడ్‌షో చేపట్టారు. కలెక్టర్‌ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు స్థానిక హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
లోక్‌సభ ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఈ రెండు స్థానాలకు మే 6న ఎన్నికలు జరగనున్నాయి.

గతంలో అటల్‌ బిహారీ వాజ్‌పేయీ లఖ్‌నవూ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2009 ఎన్నికల్లో యూపీ ఘాజియాబాద్‌ నుంచి రాజ్‌నాథ్‌ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో లఖ్‌నవూ నుంచి విజయం సాధించారు. ఈ సారి కూడా ఇదే స్థానం నుంచి రాజ్‌నాథ్‌ పోటీ చేస్తున్నారు.

Related posts