భారత ప్రధానిగా రెండవసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్రమోదీ కేబినెట్ లో కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షాకు స్థానం దక్కింది. ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమిత్ షాకు ప్రధాని నరేంద్ర మోదీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కీలకమైన ఎనిమిది కేబినెట్ కమిటీల్లో అమిత్ షాకు మోదీ చోటు కల్పించారు.
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు మాత్రం కేవలం రెండు కమిటీల్లో మాత్రమే స్థానం దక్కింది.ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్ ఆరు కమిటీల్లో ఉండగా, రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఐదు కమిటీల్లో ఉన్నారు. భద్రత, ఆర్థిక వ్యవహారాలపై నియమించిన రెండు కమిటీల్లో మాత్రమే రాజ్నాథ్ ఉన్నారు.