telugu navyamedia
సినిమా వార్తలు

ప్రభాస్‌తో భేటీ కానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఫామ్ హౌస్‌లో ఆయన అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు.

ప్రభాస్‌, కృష్ణంరాజు ఫ్యామిలీ మెంబర్స్ అంతులేని బాధలో ఉన్నారు. వారిని సినీ, రాజకీయ ప్రముఖులు ఓదార్చుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తన సంతాపాన్ని తెలియజేయబోతున్నారు.

అందులో భాగంగా రేపు(గురువారం) ఆయన ప్రభాస్‌తో భేటీ కానున్నారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్‌ ఫిక్స్ అయ్యింది.

PM Narendra Modi meets 'Baahubali' Prabhas - India News
సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొనేందుకు రేపు హైదరాబాద్‌ కి వస్తోన్న అమిత్‌ షా ముందుగా కృష్ణంరాజు కుటుంబసభ్యులను పరామర్శించి, ఆయన మృతి పట్ల తన సానుభూతిని తెలియజేయనున్నారని తెలుస్తుంది.అనంతరం అదే రోజు సాయంత్రం హీరో ప్రభాస్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

Bahubali Prabhas Meets Prime Minister Narendra Modi - Hybiz.tv - YouTube

కృష్ణంరాజు చివరి వరకు బీజేపీ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. వాజ్‌పేయి హయాంలో కేంద్రంమంత్రిగా పనిచేశారు. పలువురు బీజేపీ అగ్రనేతలతో కృష్ణంరాజుకు సాన్నిహిత్యం ఉంది. సహాయ మంత్రి హోదాలో ఆయన రక్షణ మంత్రిత్వశాఖలోను పని చేశారు. ఈ క్రమంలో అమిత్‌ షా ప్రభాస్‌ ఫ్యామిలీని కలిసి తన సంతాపాన్ని తెలియజేయబోతుండటం విశేషం.

Related posts