telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ .. విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు

KCR cm telangana

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండడంతో విద్యార్దులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం సెలవులు పొడగించింది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు దసరా సెలవులను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 19 వరకు సెలవులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వాస్తవానికి అక్టోబరు 14 నుంచి తెలంగాణలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సమ్మె కొనసాగుతుండడంతో సెలవులు పొడగించారు. ఈ నేపథ్యంలో అదనపు బస్సులు సమకూర్చుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా మరిన్ని ప్రైవేట్‌ బస్సుల కోసం నోటిఫికేషన్‌ జారీ చేయాలని కూడా సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

Related posts