telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

అక్రమ హోల్డింగ్ తో యువతి మృతి

New couples attack SR Nagar

తమిళనాడులో ఏర్పాటు చేసిన అక్రమ హోల్డింగ్ ఓ యువతి ప్రాణాలు తీసింది. ఈ విషాద సంఘటన చెన్నై నగరంలోని పల్లవరమ్ రోడ్డులో జరిగింది.పెండ్లి సందర్భంగా తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు ఆహ్వానం పలుకుతూ హోల్డింగ్ ఏర్పాటు చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల హోల్డింగ్ తో శుభశ్రీ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందింది.

వివరాల్లోకి వెళితే శుభశ్రీ అనే యువతి స్థానికంగా ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. రోజువారి లాగే విధులు ముగించుకుని తన బైక్‌పై ఇంటికి వెళుతుండగా రోడ్డు మధ్యలో అనుమతి లేకుండా వివాహ ఆహ్వానం కోసం ఏర్పాటు చేసిన హోల్డింగ్ యువతి వాహనంపై పడింది. దీంతో బైక్‌తో సహా కిందపడిపోయిన శుభశ్రీ పైనుంచి ఆమె వెనుకనే వస్తున్న వాటర్ ట్యాంకర్ దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Related posts