హిటాచీ లిమిటెడ్ అనుబంధ సంస్థ సీఈఓ బ్రియాన్ హౌస్ హోల్డర్ హిటాచీ వంటారా ప్రాంతీయ ఆపరేషన్స్ హబ్ను ప్రారంభించారు. ప్రపంచంలో భారత్ బలమైన ఆర్థిక శక్తి అని ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు. ఈ ప్రాంతీయ హబ్ భారత్, ఆసియా పసిఫిక్ ప్రాంతానికి ఆవిష్కరణలు, గ్లోబల్ డెలెవరీ కేంద్రంగా నిలుస్తుందని చెప్పారు. తమ వ్యాపారాభివృద్ధి, సామాజిక ప్రగతిలో ఇక్కడి ఆవిష్కరణలు కీలకంగా నిలుస్తాయని చెప్పారు.
సంస్థ ఆసియా పసిఫిక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, జీఎం హేమంత్ తివారి మాట్లాడుతూ.. ఈ కేంద్రంలో ప్రస్తుతం 300 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, వచ్చే ఏడాది ఆ సంఖ్య రెట్టింపు చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రొడక్ట్ అండ్ స్ట్రాటజీ ఆఫీసర్ బ్రాడ్ సురక్, చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ హాన్స్ పీటర్ క్లేయ్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ జోనాథన్ మార్టిన్, ఆసియా పసిఫిక్ సీనియర్ వైస్ ప్రెసిండెంట్ డేనియల్ చోంగ్ తదితరులు పాల్గొన్నారు.