telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రీమేక్ ఖచ్చితంగా చేస్తున్నాం.. : సురేష్ బాబు

Suresh Babu

తెలుగు చిత్ర పరిశ్రమ అగ్ర నిర్మాతగా.. టాలీవుడ్ దిగ్గజ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా రంగ ప్రవేశం చేసిన సురేష్ బాబు ఎదిగారు. రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ స్థాపించి 55 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సురేష్ బాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తమ సంస్థ నుంచి త్వరలో రాబోయే సినిమాలను వెల్లడించారు.

రానా హీరోగా మా సంస్థ `విరాట పర్వం`, `హిరణ్య కశ్యప` సినిమాలు నిర్మిస్తోంది. `హిరణ్య కశ్యప` కోసం చాలా కసరత్తు చేశాం. దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా దేశంలోనే అతి పెద్ద సినిమా కాబోతోంది. ఇక, వెంకటేష్‌, నాగచైతన్య హీరోలుగా `వెంకీ మామ` చేస్తున్నాం. అలాగే ఇటీవల బాలీవుడ్‌లో విడుదలైన `దే దే ప్యార్ దే` సినిమాను వెంకీ హీరోగా తెలుగులోకి రీమేక్ చేయబోతున్నామ`ని సురేష్ బాబు తెలిపారు.

Related posts