హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్ గా బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ నియమితులైన సంగతి తెలిసిందే. ఈ మేరకు హైదరాబాదులోని ఆయన నివాసంలో దత్తాత్రేయకు అధికారులు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్ ప్రజల అభ్యున్నతి కోసం తాను కృషి చేస్తానని చెప్పారు.
మరోవైపు, గవర్నర్ గా నియమితులైన సందర్భంగా దత్తన్నను పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ ప్రముఖులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ కు బయల్దేరి వెళ్లారు.రేపు ఉదయం 10.30 గంటలకు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేయనున్నట్టు సమాచారం.