telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్-3లో అత్యధిక పారితోషికం ఎవరికంటే ?

Bigg-Boss-3

ఎన్నో వివాదాల నడుమ మొదలైంది బిగ్ బాస్ సీజన్ 3. కింగ్ నాగార్జున హోస్ట్‌గా మొదలైన ఈ షో 100 రోజులపాటు 15మంది కంటెస్టెంట్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరించనుంది. షో మొదలైన రెండ్రోజులకే హౌజ్ మేట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. అయితే ఈ సీజన్‌లో ఎవరికీ ఎంత ఇచ్చారనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇక బిగ్‌బాస్ సీజన్ 2లో సింగర్ గీతా మాధురి ఎక్కువ పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. రోజుకి లక్ష రూపాయల దాక ఆమె తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక మూడవ సీజన్లో రోజుకి రెండు లక్షలు ముట్టజెప్పి మరీ సెలబ్రిటీలను తీసుకున్నారట. ఇంత పెద్ద ఎత్తున రెమ్యునరేషన్ ఎవరెవరికి ఇచ్చారంటూ పలుప్రశ్నలు వస్తున్నాయి. పటాస్ ద్వారా పాపులర్ అయిన శ్రీముఖి, తెలంగాణ యాసతో ఫేమస్ అయిన సావిత్రికి ఎక్కువ పారితోషికం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే వీరిద్దరికి ఎక్కువ క్రేజ్ ఉంది. అటు సింగర్ రాహుల్‌కు కూడా యూత్‌లో మంచి క్రేజ్ ఉండడంతో వీళ్లు ముగ్గురికి భారీగానే ముట్టజెప్పి ఉంటారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడానిక స్టార్ మా యాజమాన్యం పెద్ద మొత్తంలోనే ముట్టజెప్పినట్టు సమాచారం.

Related posts