సంస్కృ తి, సంప్రదాయాలకు అద్దంపట్టే మాతృ భాషను మరచిపోవద్దని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా.. శుక్రవారం హైద్రాబాద్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం మాతృ, రాష్ట్ర భాషలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మాతృ భాషతో పాటు, హిందీ తరువాతనే ఆంగ్లంలో బోధన జరగాలని సూచించారు. హిందీని పరిరక్షించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.