telugu navyamedia
క్రీడలు

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. శుక్రవారం జరిగిన పురుషుల హైజంప్‌లో ప్రవీణ్‌కుమార్‌ రజత పతకం సాధించాడు. టీ64 పురుషుల హై జంప్‌లో ప్రవీణ్ కుమార్ రజత పతకాన్ని సాధించాడు. 2.07 మీటర్ల జంప్‌తో ఈ పతకాన్ని సాధించాడు ప్రవీణ్ కుమార్.. ఇక, 18 ఏళ్లకే పతకాన్ని అందుకున్న ప్రవీణ్.. సరికొత్త ఆసియన్ రికార్డు నెలకొల్పాడు.

తాజాగా పతకంతో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 11కు చేరింది. మరోవైపు రజతం సాధించిన ప్రవీణ్‌కుమార్‌కు ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు తెలిపారు. ప్రవీణ్‌ కృషి, పట్టుదలకు నిదర్శనమే ఈ పతకమని చెప్పారు. ఈ మేరకు మోడీ ట్వీట్‌ చేశారు.

Related posts