సెప్టెంబర్ నెల వేతనాలు చెల్లించాలని కోరుతూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు వేసిన పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేరని, కొంత సమయం కావాలని ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై పిటిషనర్ స్పందిస్తూ.. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఇప్పటికే 30 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. తదుపరి విచారణ ఈ నెల 27కు హైకోర్టు వాయిదా వేసింది.
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో యాజమాన్యం తాత్కాలిక డ్రైవర్లను నియమించి బస్సులు నడిపిస్తున్న నేపథ్యంలో సదరు డ్రైవర్లకు అనుభవంలేదంటూ.. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిఐఎల్ పై కూడా సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. అనుభవం లేని తాతాల్కిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించడంతో చాలా ప్రమాదాలు జరిగాయని, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని పిటిషనర్ పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీ, రోడ్డు ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెకట్రరీలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు కోర్టు వాయిదా వేసింది.
ప్రశ్నిస్తున్నందునే నన్ను సస్పెండ్ చేశారు: అచ్చెన్నాయుడు