మక్కల్ నీది మయ్యం అధినేత కమల్హాసన్కు వ్యతిరేకంగా దాఖలైన క్రిమినల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టిపారేసింది. కమల్హాసన్ తమిళనాడులో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో..ఆ ప్రాంతానికి సంబంధించిన ఫోరమ్ లోనే దీనిపై సంప్రదించవచ్చునని పిటిషనర్ బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయకు సూచించింది.
అదే విధంగా పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ వేసిన పిటిషన్ను పరిగణలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు సూచనలు చేసింది.స్వతంత్ర భారత్లో తొలి తీవ్రవాది హిందువేనని, అతడు మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేనేనని తమిళనాడులో కమల్హాసన్ అన్న విషయం తెలిసిందే. కమల్హసన్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది.
ఎన్నికలు వాయిదా వేసే అధికారం కలెక్టర్లకు లేదు: యనమల