తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పంచాయతీరాజ్ చట్టం 285-ఏ ప్రకారం రిజర్వేషన్లు 50శాతం లోబడే ఉండాలని హైకోర్టు పేర్కొంది.
పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎన్నికల సంఘం, బీసీ కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో తాము పంపిన నోటీసులకు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 22కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.