telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

After 11 Parishat Elections Telangana

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పంచాయతీరాజ్‌ చట్టం 285-ఏ ప్రకారం రిజర్వేషన్లు 50శాతం లోబడే ఉండాలని హైకోర్టు పేర్కొంది.

పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఎన్నికల సంఘం, బీసీ కార్పొరేషన్‌, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో తాము పంపిన నోటీసులకు కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 22కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

Related posts