telugu navyamedia
వార్తలు సామాజిక

రాజస్థాన్ లో విజృంభిస్తున్న కరోనా.. హైకోర్టు చీఫ్ జస్టిస్ కు పాజిటివ్

Corona

రాజస్థాన్ లో కరోనా వైరస్ అన్ని రంగాల వారిని టచ్ చేస్తోంది. వైయరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు.

దీంతో హైకోర్టు మూడు రోజులపాటు మూసివేయబడిందని రిజిస్ట్రార్ జనరల్ పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్ ఇంద్రజిత్ మహంతికి కోవిడ్ -19 పాజిటివ్ రావడంతో రాజస్థాన్ హైకోర్టులో పనులను రాబోయే మూడు రోజులు నిలిపివేయబడతాయని పేర్కొంది. సంబంధిత వ్యక్తులందరూ కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నోటీసులో పేర్కొన్నారు.

Related posts