telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సర్కారు వారి పాట”లో హీరోయిన్ ఖరారు

SVP

పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతుండగా, జి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న విషయం విదితమే. అయితే ఇటీవల కీర్తి ప్లేస్ లో బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. కాగా మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని నిర్మాతలు కన్ఫామ్ చేసారు. సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి యూఎస్ లో కొంతమేర చిత్రీకరణ జరపాల్సి ఉంది. దీంతో కీర్తి సురేష్ యూఎస్ వర్క్ పర్మిట్ కోసం చిత్ర యూనిట్ వీసా కోసం కూడా అప్లై చేశారు. దీంతో కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. ఇక విలన్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.

Related posts