తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీలో పోటీ చేయాలనుకుంటే పోటీ చేయొచ్చని నటుడు శివాజీ అన్నారు. ఎవరికైనా మద్ధతు తెలపాలంటే తెలుపొచ్చని, కానీ కుట్రలు చేయొద్దని కేసీఆర్కు శివాజీ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల తరుణంలో రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ, జీఎస్టీ అధికారుల దాడులపై హీరో శివాజీ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు చెందిన వారు వివిధ రాజకీయ పార్టీల్లో చేరుతున్నారని వారిలో ఒక్కరు కూడా ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు.
సీ-విజిల్ అనే యాప్ రాష్ట్ర ఎన్నికల సంఘం కంట్రోల్లో లేదని అది కేంద్ర ఎన్నికల సంఘం కంట్రోల్లో ఉందని తెలిపారు. సీ-విజిల్ ద్వారా ఎవరిపై అనుమానం ఉన్నా వారి ఇంటిపై సోదాలు జరపాల్సిందిగా ఫిర్యాదు చేయవచ్చని శివాజీ పేర్కొన్నారు. ఈ తరహా దాడులు కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతున్నాయని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలపై జగన్ దెబ్బకొడుతున్నాడు: దేవినేని ఉమ