ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి, ఛార్మి నిర్మాతలు. ఇటీవలే “ఇస్మార్ట్ శంకర్” విడుదల తేదీ వాయిదా పడింది. జూలై 12 నుంచి 18కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని రామ్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశాడు. 12న వరల్డ్ కప్ ఫైనల్ ఉండటంతోనే నిర్మాతలు చార్మీ, పూరీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక సినిమా విషయానికొస్తే టాకీ పార్ట్ పూర్తి, పాటలు, ప్యాచ్ వర్క్ చిత్రీకరణ జరుగుతుంది. ఈ చిత్రీకరణలో భాగంగా యూనిట్ చార్మినార్కు చేరుకుంది. చార్మినార్ పర్యాటక ప్రాంతం కావడంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ధూమపానం నిషేధం. కానీ ఈ విషయం తెలియని షూటింగ్లో భాగంగా హీరో రామ్ అక్కడ సిగరెట్ను కాల్చారు. ఆ ఘటనను ఫోటో తీసిన తర్వాత, బహిరంగంగా సిగరెట్ తాగినందుకు పోలీసులు రామ్కు రూ. 200 జరిమానా విధించారు. కోప్టా యాక్ట్ 2003 సెక్షన్ 4 ప్రకారం పోలీసులు రామ్కు జరిమానా విధించగా హీరో రామ్ చలానా కట్టారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
previous post
ఆమెపై కోపం లేదు… కానీ అదే చిరాకేస్తుంది : విజయ్ దేవరకొండ