telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రోడ్డుపై “అర్జున్ సురవరం” పైరసీ సీడీలు… నివ్వెరపోయిన నిఖిల్…!

nikhil on suravaram movie release

యంగ్ హీరో నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి నటీనటులుగా టి సంతోష్ తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. న‌వంబ‌ర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. సినిమాకు మంచి హిట్ టాక్ సంపాదించుకోవడంతో నిఖిల్ సక్సెస్ టూర్ షురూ చేశాడు. శనివారం నాడు చిత్రబృందం గుంటూరుకు వెళ్లింది. అక్కడ్నుంచి తిరిగొస్తూ ‘అర్జున్ సురవరం’ పైరసీ సీడీలను నిఖిల్ పట్టుకున్నాడు. ఐటీసీ సెంటర్‌లో తోపుడు బండిపై పైరసీ సీడీలు అమ్ముతుండగా.. వాటిలో ఓ సీడీని తీసి ల్యాప్‌టాప్‌లో చెక్ చేయగా ఒరిజనల్ ప్రింట్ ఉన్నట్లు గుర్తించాడు. దీంతో నిఖిల్ నివ్వెరపోయాడు. “పైరసీ సీడీలు అమ్మడమేంటి..?” అని అక్కడున్న మహిళలను అడగ్గా.. “మేము అమ్ముకునే వాళ్లమే.. చేతనైతే సీడీలు తయారు చేసిన వాళ్లను పట్టుకోండి” అంటూ దురుసుగా నిఖిల్‌కు సమాధానమిచ్చారు. దీంతో స్థానిక పోలీసులకు సినిమా నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. రాత్రి గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా కారులో నుంచి ఈ సీడీలను నిఖిల్ గుర్తించాడు. ఈ విషయాన్ని నిఖిల్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

Related posts