telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రతి స్టార్ హీరోకి మేనరిజం సెట్ చేసిందే పూరి… నాగశౌర్య వ్యాఖ్యలు

Ashwatthama

యంగ్ హీరో నాగశౌర్య ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘అశ్వథ్థామ’. రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ నెల 31వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ బయటకు వచ్చి అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తన గత చిత్రాలను గురించి తెలియజేస్తూ.. దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో సినిమా మిస్ అయిన విషయాన్ని షేర్ చేసుకున్నారు నాగ శౌర్య. ఈ సందర్భంగా ఆయన పూరీ జగన్నాథ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూ స్టార్ హీరోలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఛత్రపతి’, ‘ఇంద్ర’, ‘సింహాద్రి’, ‘విక్రమార్కుడు’, ‘ఆది’ లాంటి సినిమాలు నేను మిస్ అయ్యా అనిపిస్తుంది. 2010-20 వరకూ ఇలాంటి సినిమాలు చెప్పుకోవడానికి ఐదు కంటే ఎక్కువ లేవు. గొప్ప సినిమాలు వచ్చాయి. జెర్సీ, ఊహలు గుసగుసలాడే, అర్జున్ రెడ్డి, మహర్షి, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ ఇలా మంచి మంచి చిత్రాలు వచ్చాయి కాని.. వీటిలో మాస్, క్లాస్, సాఫ్ట్ అన్నీ ఉన్నాయి కాని వైల్డ్ నెస్ అనేది లేదు. ఈ మధ్య కాలంలో థియేటర్స్‌లో ప్రేక్షకులు షర్ట్ విప్పి పూలుచల్లే సినిమాలైతే లేవనే చెప్పాలి. అయితే చాలా రోజుల తరువాత అలాంటి అనుభూతి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో కలిగింది. మళ్లీ పూర్వ వైభవం కనిపించింది. పూరీ జగన్నాథ్ ఈజ్ బ్యాక్ అనిపించేలా ఆ సినిమా ఉంది. నాకు పూరీ జగన్నాథ్‌, గౌతమ్ వాసుదేవ్ మీనన్‌తో చేయాలని నాకు ఎప్పటినుండో కోరిక. వాళ్లతో పనిచేయడం ఇష్టం. పూరీ జగన్నాథ్ సినిమాలో ఒక్కసారి మనం చేస్తే.. హీరోకి ఒక మేనరిజం, వాళ్లకంటూ ఓ క్యారక్టరైజేషన్ వస్తుంది. అప్పటినుండి ఆడియన్స్ ఆ హీరోని వేరే రేంజ్‌లో చూడటం మొదలుపెడతారు. అది డైరెక్టర్ ఇచ్చే గొప్ప వరం. ఇలాంటి వరాలు పూరీ జగన్నాథ్ చాలా మంది హీరోలకు ఇచ్చారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోకి మేనరిజం సెట్ చేసిందే పూరి జగన్నాథ్. అది ఎవరూ గమనించలేదు కాని.. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా స్టార్ హీరోలందరికీ మేనరిజం‌ని సెట్ చేసింది ఆయనే. ఇప్పుడు వాళ్లకంటూ ఓ మేనరిజం ఉంది అంటే.. ఒకే ఒక్క కారణం పూరీ జగన్నాథ్. హీరోయిజం అనేది ఆయన ఇచ్చిందే. అలాంటి మేనరిజం నాకూ కావాలనే స్వార్ధం అయితే నాకు ఉంది. అది ఎప్పుడు వస్తుందా? అని వెయిట్ చేస్తున్నా. నా లైఫ్‌లో అంత మంచి వ్యక్తిని ఎప్పుడూ కలవలేదు. నిజానికి పూరీగారు.. నేను ఒక సినిమా అనుకుని కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. స్టోరీ డిస్కషన్ అంతా అయిపోయి సెట్స్ మీదికి వెళ్తుంది అనుకున్న సందర్భంలో ఆగిపోయింది. అప్పుడు చాలా బాధపడ్డా.. కాని మా ఇద్దరి మధ్య మంచి ర్యాపో అయితే కొనసాగుతోంది. తప్పకుండా ఆయనతో సినిమా చేస్తా’ అంటూ చెప్పుకొచ్చారు నాగ శౌర్య.

Related posts