మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టు గాడ్ ఫాదర్ . మలయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ కు రీమేక్ గా వస్తున్న ఈ మూవీని మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ కొనసాగుతుంది. కాగా ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రాజెక్టుకు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ చిరు అభిమానులు, సినీ లవర్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ చిత్రంలో విలన్ గా మలయాళ నటుడు బిజూ మీనన్ కనిపిస్తాడని ఇప్పటివరకు ప్రచారంలో ఉంది.
కానీ ఇపుడు తాజాగా మరో క్రేజీ స్టార్ హీరో పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చింది. ఇంతకీ ఆ స్టార్ ఎవరో కాదు. దక్షిణాదితోపాటు నార్తిండియా ప్రేక్షకులకు సుపరిచితుడైన మాధవన్. అయితే మాధవన్ ఈ ప్రాజెక్టులో భాగం అవుతున్న విషయంపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇప్పటికే తెలుగులో సవ్యసాచి చిత్రంలో విలన్ గా కనిపించాడు మాధవన్. ఎన్నో హిట్ చిత్రాల్లో వివిధ భాషల్లో నటించి కోట్లాదిమంది కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించిన మాధవన్..గాడ్ ఫాదర్ లో నటిస్తున్నాడన్న వార్తతో సినిమాపై అంచనాలు మరింత అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
గాడ్ ఫాదర్ లో టాలీవుడ్ యువ హీరో సత్యదేవ్ కీలక పాత్రలో కనిపిస్తోండగా..లేడీ సూపర్ స్టార్ నయనతార అతని భార్య పాత్రలో నటిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. మరోవైపు అందాల నటి అనసూయ భరద్వాజ్ కీ రోల్ పోషిస్తోంది. చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ పనిచేస్తున్నారు.
ఇక చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న మరో సినిమా ఆచార్య. త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోబోతోంది. కరోనా పరిస్థితుల కారణంగా ఆలస్యమైన సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి తన 152వ మూవీపై లుగు సినీ పరిశ్రమలో భారీగా అంచనాలున్నాయి.
వాస్తవానికి మే 13న విడుదల కావల్సి ఉండగా..కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్ నిలిచిపోయి ఆలస్యమైంది. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉంది..కాజల్ హీరోయిన్గా నటిస్తుండగా..పూజా హెగ్డే, రామ్ చరణ్ కీలక పాత్రలో కన్పించనున్నారు. మణిశర్మ సంగీతం సినిమాకు హైలైట్ కానుంది.
.