telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఇద్దరి లోకం ఒకటే” ట్రైలర్

ILO

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మాతగా.. జి.ఆర్. కృష్ణ డైరెక్షన్‌లో రాజ్ తరుణ్, శాలిని పాండే హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి వరుస అపజయాలతో ఉన్న రాజ్ తరుణ్‌తో, నిర్మాత దిల్ రాజు పెద్ద సాహసమే చేస్తున్నారనే వార్తలు బాగా వినిపించాయి. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై ఇప్పుడు ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. రాజ్ తరుణ్, షాలిని చిన్నప్పటి ఫ్రెండ్స్ అనే విషయం ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. వీరిద్దరూ దాదాపు 8 ఏళ్ళు విడిపోయి, ఆ తరువాత మళ్ళీ కలుసుకుంటారు. ఆ తరువాత వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది ? ఏం జరిగింది ? అనేది చిత్రకథాంశం. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts