యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెషల్ డ్యాన్స్తో అలరించనుంది. బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ను కలుసుకునే అవకాశాన్ని నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ కల్పించింది. ప్రభాస్ను ఎలా కలుసుకోవాలనే దానిపై ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ “హాయ్ డార్లింగ్స్.. నన్ను కలుసుకోవాలనుకుంటన్నారా? “సాహో” పోస్టర్తో పాటు ఓ సెల్ఫీ తీసుకుని, దాన్ని నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ట్యాగ్ చేయండి. నేనే పర్సనల్గా విన్నర్స్ను సెలక్ట్ చేస్తాను” అన్నారు. మరింకేం “సాహో” పోస్టర్ కానీ, స్టాండీ, కటౌట్, ఫ్లెక్సీ, టీవీ లేదా కంప్యూటర్లో కానీ సాహో స్టిల్ ఏదైనా సరే… ఓ సెల్ఫీ దిగేయండి. ఆ సెల్ఫీని ప్రభాస్ ఇన్స్టా అకౌంట్ @actorprabhas కు ట్యాగ్ చేసేయండి. ప్రభాస్ను పర్సనల్గా కలుసుకునే అవకాశాన్ని ఉపయోగించుకోండి.
Here is Your golden chance to meet Rebel Star #Prabhas!! 💥💥
Click a selfie with #Saaho poster & tag #Prabhas on Instagram
He will choose winners & meet themhttps://t.co/nXSIGdkZCX pic.twitter.com/stN6W0sxGt— BARaju (@baraju_SuperHit) 27 August 2019