తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో ఆయన నటించిన చిత్రం “సైరా నరసింహారెడ్డి”. సురేందర్రెడ్డి దర్శకుడు. అమిత్ త్రివేది స్వరకర్త. శ్రీమతి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్చరణ్ నిర్మించారు. ఆదివారం హైదరాబాద్లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చిరంజీవి తన 41 ఏళ్ళ కెరీర్లో ఒక హిస్టారికల్ క్యారెక్టర్ చేయడం ఇదే మొదటిసారి. అంతేకాదు చిరంజీవి నటించిన ఈ సినిమా ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, తమిళం,కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కావడం అనేది కూడా ఫస్ట్ టైమే అని చెప్పొచ్చు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ‘U/A’ సర్టిఫికేట్ ను పొందింది. ఈ సినిమా అక్టోబర్ 2న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం చిత్ర ట్రైలర్ విడుదల కాగా, ఇది సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఈ చిత్రంలో చిరంజీవి, నయనతార, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్ చిత్రంగా సైరా రూపొందగా, ఈ ప్రాజెక్ట్ కోసం 280 కోట్ల బడ్జెట్ ఖర్చయిందని ఇన్సైడ్ టాక్. చిరంజీవి రెమ్యునరేషన్ కాకుండా అంత మొత్తం ఖర్చు చేసారని చెబుతుండగా, సినిమా లాభాలలో మెగాస్టార్ వాటా పుచ్చుకుంటాడని అంటున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరగగా, పెట్టిన ఖర్చు మొత్తం రెండు మూడు రోజులలో నిర్మాతలు పొందుతారని విశ్లేషకులు అంటున్నారు. కొణిదెల ప్రొడక్షన్ బేనర్పై రామ్ చరణ్ చిత్రాన్ని నిర్మించిన విషయం విదితమే.
previous post
next post