కర్ణాటక రాష్టంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అక్కడి ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. కుండపోత వర్షాలకు తోడు వరదలు ఉప్పొంగుతున్నాయి. ఆగస్టు 1 నుంచి ఇప్పటి వరకు 40 మంది మృతి చెందారు. మరో 14 మంది అదృశ్యమైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక 5,81,702 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
50,595 జంతువులను వరదల నుంచి రక్షించారు. 3,27,354 మంది 1168 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించారు. ఈ భారీ వర్షాలకు, వరదలకు 17 జిల్లాల్లోని 80 తాలుకాలు తీవ్రంగా నష్టపోయాయి. 2028 గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4.20 లక్షల హెక్టార్లలో పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.