telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

భక్తులతో తిరుమల కిటకిట .. శ్రీవారి దర్శనానికి 10 గంటలు

TTD gold thefted will be to Tirumala today

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు పోటేత్తారు. స్వామి వారిని దర్శించుకునే భక్తులు 25 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. నడకదారి గుండా వచ్చే భక్తులకు, టైం స్లాట్ టోకెన్ దర్శనానికి, అలాగే స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.

భక్తుల రద్దీ కారణంగా అన్ని రకాల క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లతో పాటు ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడుతోంది. శుక్రవారం శ్రీవారిని 70,830 మంది భక్తులు దర్శించుకున్నారు.ఆలయంలో భక్తుల రద్దీ కారణంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా సిబ్బందిని నియమించారు.

Related posts