telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో 98 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

drugs mafia in kalki bhagavan asram

అధికారులు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా.. డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతూనే ఉంది. ఎన్నిసార్లు పట్టిబడిన డ్రగ్స్ మాఫియాలో ఎలాంటి మార్పు రావటం లేదు. అయితే తాజాగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. జోహన్నెస్బర్గ్ నుండి ఢిల్లీ వచ్చిన ఇద్దరు స్మగ్లర్ల వద్ద 98 కోట్ల విలువ చేసే హెరాయిన్ గుర్తించారు పోలీసులు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి 14 కేజీల డ్రగ్స్ ను తరలించే ప్రయత్నం చేశారు నిందితులు. డ్రగ్స్ ను లగేజ్ బ్యాగ్ లో దాచి గ్రీన్ చానెల్ ద్వారా బయటకు చెక్కేసే యత్నం చేశారు కేటుగాళ్లు. అయితే..అనుమానం రావడంతో ఇద్దరిని అడ్డగించారు కస్టమ్స్ అధికారులు. వారి లగేజ్ బ్యాగ్ ను స్కానింగ్ చేయగా డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు బయట పడింది. ఈ కేసులో ఇద్దరిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. ఆ ఇద్దరు నిందితులు జాంబియా దేశస్థులని సమాచారం అందుతోంది.

Related posts