కరోనా వైరస్ నుంచి రక్షణ పొందాలంటే వ్యాధి నిరోధక శక్తి మెరుగ్గా ఉండాలి. అయితే ఇందు కోసం మందులూ లేకపోలేదు. అయితే వీటి అవసరం ఎవరికీ ? ఆరోగ్యకరమైన జీవనశైలిని గడిపే ప్రతి ఒక్కరికీ వ్యాధినిరోధక శక్తి మెరుగ్గానే ఉంటుంది. రోజుకు 8 గంటలు తక్కువ కాకుండా నిద్రపోతూ, పౌష్టికాహారం తీసుకుంటూ, క్రమం తప్పక వ్యాయామం చేసేవారిలో రోగనిరోధక శక్తి తప్పకుండా మెరుగ్గానే ఉంటుంది. కాబట్టి వీరికి అదనంగా మందులు వాడవలసిన అవసరం లేదు. అయితే వీరితో పోల్చుకుంటే పిల్లల్లో, వృద్ధుల్లో ఇమ్యూనిటీ తక్కువే. అలాగే వీరికంటే కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు దీర్ఘకాలిక చికిత్సలు తీసుకుంటున్నవారు, రూమటాయిడ్ ఆర్ద్రయిటిస్తో బాధపడుతూ స్టెరాయిడ్స్ వాడుతున్న వారు, మధుమేహులు, అధిక రక్తపోటు, మూత్ర పిండాల వ్యాధులు, ఊపిరితిత్తుల రుగ్మతలు కలిగి ఉన్నవారు, వ్యాధి నిరోధక శక్తిని తగ్గించి ఉంచే మందులు వాడే అవయవ గ్రహీతలలో రోగనిరోధక శక్తి మరింత బలహీనంగా ఉంటుంది. కాబట్టి వీళ్లు వైద్యుల సూచన మేరకు రోగనిరోధకశక్తిని పెంచే ఇమ్యూన్ బూస్టర్స్ వాడడం ద్వారా ప్రబలె ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు.
previous post
next post
మోదీని సంతృప్తి పరచడానికే ఎగ్జిట్ పోల్స్: విజయశాంతి