పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు(పీఎంసీ) కుంభకోణం కేసులో ఈ రోజు పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. హౌజింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వైస్ చైర్మన్ సారంగ్ వద్వాన్, డైరక్టర్ రాకేశ్ వాద్వాన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణలో ఆ ఇద్దరూ సహకరించకపోవడంతో వార్ని అరెస్టు చేశారు.
పీఎంసీ బ్యాంకు నుంచి భారీ రుణాలు తీసుకున్న 44 మంది ఇప్పటి వరకు ఎటువంటి చెల్లింపులు చేయలేదు. దాంట్లో పది అకౌంట్లు హెచ్డీఐఎల్, వాద్వాన్లకు చెందినవే ఉన్నాయి. అరెస్టు అయిన ఇద్దరికీ పర్సనల్ అకౌంట్లు కూడా ఉన్నాయి. ఈ ఇద్దరి వల్లే పీఎంసీ బ్యాంకుకు సుమారు 4325 కోట్లు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.