telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బండి సంజయ్ కి హరీష్ సవాల్..దుబ్బాక బస్టాండ్ కాడికి రా.. !

harish rao trs

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అవాస్తవాలు ప్రచారం చేస్తూ..గెలవాలనుకుంటోందని మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. బీడీ కార్మికులకు రూ.2 వేల పింఛనుతో రూ.1600 ప్రధాన మంత్రి మోడీ ఇస్తున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అవాస్తవాలు చెప్పి ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. “కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు రూ. 2000 పింఛన్లలో రూ.1600 కేంద్రమీవి అని నిరూపిస్తే నా మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నిరూపించకపోతే నువ్వు MP పదవికి, రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తావా” అని బండి సంజయ్ కి సవాల్ విసిరారు మంత్రి హరీష్ రావు. అంతేకాదు దీనిపై తేల్చుకుందామని..దుబ్బాక బస్టాండ్ కాడికి రమ్మని బండి సంజయ్ కి సవాల్ విసిరారు. రాజకీయ లబ్ధి పొందేందుకే బీజేపీ గోబెల్స్‌ ప్రచారానికి దిగిందని.. అందుకోసమే సోషల్‌ మీడియాలో తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు విషయాలను ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న పింఛన్‌లో మొత్తం డబ్బులు కేంద్రమే ఇస్తుందని బీజేపీ నాయకులు అబద్ధాలు చెప్పి ప్రచారం చేస్తూ ఓట్లడగడం సిగ్గుచేటని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

Related posts