telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ కోసం రాజీనామా చేయ‌కుండా కిష‌న్ రెడ్డి పారిపోయారు

Harish Rao trs

దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం తొగుట‌లో టీఆర్ఎస్ యువ గ‌ర్జ‌నలో మంత్రి హ‌రీష్ రావు పాల్గొన్నారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్ర‌సంగించారు. సాధ్యం కాద‌నుకున్న తెలంగాణ‌ను టీఆర్ఎస్ పార్టీ సాధించిందని.. రాష్ట్ర ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కి తీసుకుంటే ఎమ్మెల్యేలంద‌రూ రాజీనామా చేశారని.. రాజీనామా చేయ‌కుండా కిష‌న్ రెడ్డి పారిపోయారని ఫైర్ అయ్యారు. తెలంగాణ తెచ్చింది తాము అని ఈరోజు బీజేపీ నేత‌లు మాట్లాడుతున్నారని.. 70 ఏళ్ల‌లో కాంగ్రెస్, టీడీపీలు చేయ‌ని ప‌నుల‌ను టీఆర్ఎస్ పార్టీ చేసి చూపించింద‌ని తెలిపారు. రైతుల‌కు 24 గంట‌ల పాటు నాణ్య‌మైన విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని చెప్పారు. మ‌న‌కు రావాల్సిన నిధులు, నీళ్ల‌ను తెచ్చుకున్నామ‌ని పేర్కొన్నారు.
బీజేపీ న‌ల్ల‌ధ‌నం హామీ ఏమైంది? అని ప్ర‌శ్నించారు. దేశంలోని ప్ర‌తి పౌరుడి ఖాతాలో రూ. 15 ల‌క్ష‌లు వేస్తామ‌ని చెప్పారు. దేశంలో ఎవ‌రి ఖాతాలోనైనా రూ. 15 ల‌క్ష‌లు వేశారా? అని అడిగారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి కోటి ఉద్యోగాలన్నారు. ఆరేళ్లలో ఆరు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి క‌దా? మ‌రి ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. నిజామాబాద్‌లో అర్వింద్ కుమార్ తాను గెలిస్తే… పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు. వచ్చిందా పసుపు బోర్డు అని అడిగారు. ముత్యం రెడ్డి మంచి నాయకుడని కాంగ్రెస్ మొసలి కన్నీరుకారుస్తోంది. అదే నిజమయితే కాంగ్రెస్ పార్టీ 2018లో టికెట్ ఎందుకు ఇవ్వలేద‌ని ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి హ‌రీష్ రావు ప్ర‌శ్నించారు.

Related posts