తెలంగాణలో ఇటీవలే ప్రారంభించిన కొండపోచమ్మ కాలువకు గండి పడిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. బుధవారం విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపై విపక్షాలు రాద్దాంతం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో కాలువలు, ప్రాజెక్ట్లు కొట్టుకుపోయాయని తెలిపారు.
ఎస్ఆర్ఎస్పీ ప్రారంభించినప్పుడు కాలువకు రెండు చోట్ల గండ్లు పడ్డాయని, ఖమ్మం జిల్లా పాలెం వాగు ప్రాజెక్టే కొట్టుకుపోయిందన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణదశలోనే గోదావరిలో కొట్టుకుపోయిందన్న విషయాన్ని గుర్తు చేశారు. దేవాదుల పైపులు పటాకుల్లా పేలిపోయాయని, గుజరాత్లో సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ కాలువలకు 200సార్లు గండ్లు పడ్డాయని విపక్షాల విమర్శలను కొట్టిపడేశారు.
జీఎన్ రావు కమిటీ నివేదికపై కేబినెట్ లో చర్చ జరగాలి: పురంధేశ్వరి