telugu navyamedia
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ సినిమా… స్పందించిన దర్శకుడు

Harish-Shankar

అల్లు అర్జున్‌ హీరోగా “దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్” రూపొందించిన త‌ర్వాత ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ చాలా గ్యాప్ తీసుకుని ఇటీవ‌ల మెగా హీరో వరుణ్ తేజ్‌తో “వాల్మీకి” సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమా కోసం పూజా హెగ్డే రెండు కోట్ల రూపాయ‌లు డిమాండ్ చేసింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. “వాల్మీకి” త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్, ప‌వ‌న్‌ కళ్యాణ్ తో సినిమా చేయ‌బోతున్నాడ‌ని, ఇప్ప‌టికే వీరి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ రెండు వార్త‌ల గురించి హ‌రీష్ శంక‌ర్ ట్విట‌ర్ ద్వారా స్పందించాడు. “ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న రెండు వార్త‌ల గురించి స్ప‌ష్టత ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంద‌నుకుంటున్నాను. మొద‌టిది పూజా హెగ్డే రెమ్యున‌రేష‌న్ గురించి. ఆమె భారీ పారితోషికం డిమాండ్ చేస్తోందంటూ వ‌స్తున్న వార్త నిజం కాదు. ఇక రెండోది ప‌వ‌న్‌ కళ్యాణ్ తో సినిమా గురించి. మీకంద‌రికీ తెలుసు నేను ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ కళ్యాణ్ ను డైరెక్ట్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాన‌ని. అయితే ఇటీవ‌ల మా మ‌ధ్య మీటింగ్ జ‌రిగిందనేది మాత్రం అబ‌ద్ధం” అని హ‌రీష్ శంక‌ర్ ట్వీట్ చేశాడు.

Related posts