telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

హరీశ్ రావు పీఏకు కరోనా సోకినట్టు వార్తలు!

Harish Rao trs

లాక్ డౌన్ నిబంధనలను సడలించిన అనంతరం తెలంగాణలో కరోనా వియలయతాండవం చేస్తోంది. దీంతో ప్రతిరోజు దాదాపు 200 కొత్త కేసులతో కలకలం రేపుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాలలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్ కు కరోనా సోకిందనే వార్త వచ్చి ఒక్క రోజు కూడా గడవక ముందే ఈరోజు మరో వార్త షాకిస్తోంది.

తెలంగాణ మంత్రి హరీశ్ రావు పీఏకు కరోనా సోకినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ప్రజాప్రతినిధుల వద్ద పని చేస్తున్న సిబ్బందికి కూడా కరోనా సోకుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నారు.

Related posts