telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మూడు నెలల్లో కాళేశ్వరం నీళ్లు: హరీశ్ రావు

harish rao trs

గోదావరి జలాలతో సింగూరు దాహార్తి తీర్చుతామని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డిలో మునిసిపల్ ఎన్నికల ప్రచారంలోఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ మూడు, నాలుగు నెలల్లో కాళేశ్వరం నీళ్లు వస్తాయని తెలిపారు. ఈ ఏడాదిలోనే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు తెచ్చే బాధ్యత తనదేనని చెప్పారు.

మున్సిపల్ ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని చెప్పారు. సంగారెడ్డిలో మంచినీటి సమస్యను పరిష్కరించామని తెలిపారు. సంగారెడ్డిని దత్తత తీసుకుని అన్ని వార్డులు తిరుగుతానని, సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పారు.

Related posts