పటాన్చెరులో నిర్వహించిన టీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, సంగారెడ్డి జిల్లా ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గెలిచే అభ్యర్థులనే పార్టీ ఎంపిక చేస్తుందన్నారు. టికెట్ రాలేదని ఆశావహులు ఎవరూ నిరాశ చెందొద్దు. అవకాశం రానివారిని నామినేటెడ్ పోస్టులతో గౌరవించుకుందాం. వార్డుల వారీగా ప్రచారానికి ప్రణాళికలు, వ్యూహాలు సిద్ధం చేయాలన్నారు.
పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కష్టపడి పనిచేయాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో సర్వేలన్నీ టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నా.. పని విషయంలో అలసత్వం వద్దు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు పట్టణంలోని ప్రతి వార్డులో ఉన్నారు. ప్రతి వార్డులో ఇంటింటికెళ్లి ప్రతి ఓటరును కలవండి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించండని మంత్రి పార్టీ శ్రేణులకు సూచించారు.
175 సీట్లలో గెలుస్తాం.. మళ్ళీ అధికారం మాదే: లోకేశ్